ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణం లోని సింగరేణి ఏరియా హాస్పిటల్ సమీపంలో నివాసం ఉండే అరికపురం రాజేశ్వరి అనే నిరుపేద మహిళ ఇటీవల అనారోగ్య రీత్యా మరణించింది.దశదినకర్మ సైతం చేయలేని దిన స్థితిలో ఉన్న కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందించారు. ఈకార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సట్ల మహేందర్,కోశాధికారి తూముల సురేష్ , ఉపాధ్యక్షుడు బొద్దుల సతీష్ సభ్యులు జెట్టి శ్రీనివాస్, జె సతీష్, మోటం తిరుపతి , కొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు