Kharif Cultivation Reaches 26,956 Acres in Nekkonda
నెక్కొండలో 26,956 ఎకరాల్లో వానాకాలం పంటలు
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలో వానాకాలం పంటల సాగు మొత్తం 26,956 ఎకరాలకు చేరినట్లు తహసిల్దార్ వేముల రాజ్ కుమార్ చైర్మన్ తెలిపారు. గురువారం లైన్ డిపార్ట్మెంట్లతో కలిసి పంటల విస్తీర్ణంపై సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలు సాగులోకి వచ్చాయని వివరించారు. సమావేశంలో యం పి యస్ ఓ హనుమంతు నాయక్, ఏ ఓ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ ఈ చందన, ఏ ఈ ఓలు రాజేష్, రఘు పాల్గొన్నారు.
