సీఐపై హత్యాయత్నం కలకలం..

వివాహేతర సంబంధమే కారణమా..?

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐ గా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది.

జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కానిస్టేబుల్ కత్తితో సీఐపై దాడి చేసినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు.

కాగా సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.

వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఈ సంఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!