భద్రాచలం నేటి ధాత్రి
ఆరు నెలల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలి.
ఆశ్రమ పాఠశాల CRT ఉద్యోగుల నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు..SFI
యస్.భూపేందర్
జిల్లా ఉపాధ్యక్షులు
భద్రాచలం పట్టణంలో ఐటిడిఏ ఆఫీస్ ముందు ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ టీచర్లు(CRT) చేస్తున్న నిరవధిక సమ్మెకు ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, ఈ నిరవధిక సమ్మెకు మద్దతు తెలియజేస్తూ జిల్లా ఉపాధ్యక్షులు యస్,భూపేందర్ మాట్లాడుతూ…
గత ఆరు రోజులుగా ఆశ్రమ పాఠశాలల CRT ఉద్యోగులు నిర్వర్తిక సమ్మె SFI సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదని తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో పేద, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ముందుండే కాంట్రాక్ట్ టీచర్లకు గత ఆరు నెలల నుండి జీతాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారని తక్షణమే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు హామీలు ఇచ్చి అధికారం వచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను నెరవేర్చే దాంట్లో ముందు ఉండకుండా టీచర్లను ఇబ్బందులు పెడుతున్నారని, ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టం చెబుతున్న చట్టాన్ని కూడా తుంగలో తొక్కుతూ,రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయకుండా ఉద్యోగులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు, రాష్ట్రవ్యాప్తంగా 2,100 మంది కాంట్రాక్ట్ టీచర్స్ పనిచేస్తున్న వారి ఉద్యోగ భద్రత లేదని, జీతభత్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా అరకురా జీతాలను కూడా నెలనెలా ఇవ్వకుండా నిర్లక్ష్యం గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాల CRT ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, పాఠశాలలో చదువులు లేక ఉపాధ్యాయులు బోధన సిబ్బంది సమ్మెలో ఉంటే ఎలా చదువుకుంటారని విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని కొంతమంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేసిన ఆశించిన మేరకు సిలబస్ పూర్తికావడం లేదని పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో పరీక్షలు ఎలా రాయాలని ఆందోళనలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కారం చేయకపోతే SFI ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలోని విద్యార్థులందరినీ సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉద్యమాభివందనాలతో…
భారత విద్యార్థి ఫెడరేషన్(SFI)
యస్. భూపేందర్
జిల్లా ఉపాధ్యక్షులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ
9912705719.