సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా.

C&MD

సింగరేణి సి&ఎండి శ్రీ ఎన్ బలరాం ఆదేశానుసారంగా సింగరేణి విద్యా సంస్థలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి అడుగేస్తున్నాము :

మందమర్రి నేటి ధాత్రి

సింగరేణి విద్యా సంస్థలలో 9 పాఠశాలలు ఒక మహిళా జూనియర్ కాలేజ్, ఒక మహిళా డిగ్రీ మరియు పీజీ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ను మొత్తం 7642 విద్యార్థులతో విజయవంతంగా నడిపిస్తున్నాము.

C&MD
C&MD

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ది కై అకాడమిక్స్ & క్రీడలు అథ్లెటిక్స్ మ్యూజిక్, NCC మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నాం.

విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యని అందించాలనే ఉద్దేశంతో యోగా మరియు మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది

అధ్యాపకులు మరియు ఆచార్యులకు ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం.

అధ్యాపకులను వివిధ విద్యాసంస్థలకు పంపి అక్కడి మంచి పద్ధతులు తెలుసుకొని మన విద్యాసంస్థల్లో ఆచరణలో పెట్టడానికి చర్యలు తీస్కుకొవడం జరుగుతుంది

సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ లో ఎన్ పి టీ ఈ ఎల్ చాప్టర్ NPTEL Chapter ను ప్రారంభించి విద్యార్థులను మరియు అధ్యాపకులను అనేక కోర్స్ లలో నమోదు చేయించడం జరిగింది.

C&MD
C&MD

2024-25 సంవత్సరానికి గాను సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కి NAAC అక్రిడేషన్ రావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాం.

సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మరియు సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ లో కొత్త కోర్సలు పెట్టబోతున్నాం. పాలిటెక్నిక్ కాలేజీలో ఏఐఎంఎల్ అనే కొత్త కోర్సుని ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు వస్తాయని యాజమాన్యం ఈ యొక్క కోర్స్ ను ప్రవేశ పెట్టబోతుంది.

సింగరేణి పాలిటెక్నిక్ కాలేజ్ లొ NBA అక్రిడేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది.

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ నీట్ మరియు బిట్సాట్ పరీక్షలపై అవగాహన మరియు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది

సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెక్టార్-3 గోదావరిఖని సీబీఎస్సీ సిలబస్ ను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు.

C&MD
C&MD

పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి గైర్హాజారు నీవారించడం మరియు సమయపాలన పాటించడం గురించి చెప్పడం జరుగుతుంది అలాగే వారిని మంచి శిక్షణ పద్ధతులు లైఫ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ ఎలా ఇవ్వాలో చెప్పడం జరుగుతుంది.

స్కూల్ విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఎడ్యుకేషన్ టూర్ లకు తీసుకు వెళ్లడం జరుగుతుంది

సింగరేణి పాఠశాలల కరస్పాండెంట్ల ఎప్పటికప్పుడు special focus పెడుతున్నారు.
సుమారు అధ్యాపకులు మరియు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా కోరడం జరుగుతుంది. అలాగే పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం

సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినులు మరియు అధ్యాపకులు ఇస్రో స్టార్ట్ ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది

అలాగే సింగరేణి విద్యార్థిని విద్యార్థులు గౌరవ ప్రధానమంత్రి వర్యుల పరీక్ష పే చర్చ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

సింగరేణి పాఠశాలలో మొదటిసారిగా పాఠశాల
విద్యార్థిని విద్యార్థులు సైన్స్ మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్స్ లో పాల్గొనడం జరిగింది

అలాగే సీఎం కప్ క్రీడలలో లో సుమారు 500 విద్యార్థులు పాల్గొనడం జరిగింది

సింగరేణి విద్యా సంస్థల అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు
టీచర్స్ యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది
మరియు ఐఐటీ ప్రవర్తక్ కెరీర్ కౌన్సెలింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
విద్యార్థుల పరీక్షల దృష్ట్యా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పెట్టి దృష్టి పెడుతున్నాం
ఇందులో భాగంగా వారికి అల్పాహారం/స్నాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది

పాఠశాలల ఆవరణలో భారతదేశ మరియు ప్రపంచంలో పేరుగాంచిన శాస్త్రవేత్తల మరియు స్వాతంత్ర సమరయోధుల ఫ్లూట్ బోర్డ్ లను పెట్టడం జరిగింది

అన్ని సింగరేణి పాఠశాలలో NCC ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

ఈ సంవత్సరం సింగరేణి కాలరీస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు సింగరేణి కాలరీస్ హై స్కూల్ మందమర్రి 50 వసంతాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవములు జరుపుకోబోతున్నది అని వ్యక్తపరిచారు.

ముఖ్య అతిథి;
సింగరేణి ఎడ్యుకేషనల్ సెక్రటరీ జి శ్రీనివాస్ పాల్గొన్నవారు;
నస్పూర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నరసింహస్వామి,

సిసిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంతోష్ దేశాయ్,

మందమర్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!