స్వతంత్ర అభ్యర్థిగా తూర్పు బరిలోకి ఆడేపు నాగేష్ నేత

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

రాబోయే జనరల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వరంగల్ తూర్పు నియోజకవర్గమైన కరీమాబాద్ కి చెందిన ఆడేపు నాగేష్ నేత వరంగల్ తూర్పు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. బడుగు బలహీనవర్గాల కోసం నిరంతరం అనేక కార్యక్రమాలు చేస్తూ, బీసీ సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టిన నన్ను బీసీ బిడ్డగా ఆదరించి, కుల బాందవులు సుదీర్ఘంగా ఆలోచన చేసి నన్ను గెలిపించాలని వరంగల్ తూర్పు ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *