ఆరూరి రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి

బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే

బీజేపీ అర్బన్ అధ్యక్షులు
సామల మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి సిఆర్ నగర్ బాంబుల గడ్డలో ఇంటింటి ప్రచారంలో నిర్వహించిన బిజెపి పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు శ్యామల మధుసూదన్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే కుటుంబ పార్టీలు అంతం కావాలంటే ప్రజలందరూ ఐక్యమత్యం కావాలి బిఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ లాంటిది బిఆర్ఎస్ లో కేసీఆర్ పోతే కేటీఆర్ కాంగ్రెస్ లో సోనియా గాంధీ పోతే రాహుల్ గాంధీ కుటుంబ పార్టీలలో వేరే వ్యక్తులకు పార్టీలో సీఎం అయ్యే అవకాశం ఉండదు సామల మధుసూదన్ రెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీలో గనుక చూసుకున్నట్లయితే అటల్ బిహారీ వాజ్పేయి కి నరేంద్ర మోడీ ఎలాంటి సంబంధం లేదు దేశ ప్రజల అందరికీ సుపరిపాలన అందించేది మోడీని మేము గత పది రోజులుగా భూపాలపల్లి మున్సిపాలిటీలో వివిధ కాలనీలలో ప్రచారం ముమ్మరంగా చేస్తా ఉన్నాం. ఏ ఇంటికి పోయిన దేశంలో మోడీకి తప్ప వేరే వ్యక్తికి చోటు లేదని చిన్న పిల్లవాడి నుండే ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చెప్తున్నారు దేశంలో మోడీ లేకపోతే మన స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతోటి ఉండాలి తప్ప అని ప్రజలంతా అంటున్నారు కాబట్టి భూపాలపల్లి అన్ని వర్గాల ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆరూరి రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని మధుసూదన్ రెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి అర్బన్ ఉపాధ్యక్షులు ఉరెటి మునిందర్ బూత్ అధ్యక్షులు పోన్న శ్రీనివాస్ దూలం మొండయ్య శేఖర్ అనిల్ రాజు రవి స్వప్న జోష్మి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *