ప్రజాపాలన పై సారథి కళాకారుల ఆరు గ్యారంటీలపై కళా ప్రదర్శన

ములుగు జిల్లా నేటిధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నిర్వహిస్తున్న ప్రజా పాలన లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ములుగు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారధి బోడ కిషన్ కళా బృందం శనివారం ములుగు మండలం జాకారం గ్రామంలో ఆరు గ్యారంటీల పథకాలను వివరిస్తూ కళాయాత్ర నిర్వహించారు.
ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ఆటపాటలతో చైతన్యం కల్పించారు ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని పాటల ద్వారా వివరించారు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి సద్విని పరుచుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజాపాలన కళాజాత నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రహీముద్దీన్ మార్త రవి రాగుల శంకర్ రేలా విజయ్ రెల కుమార్ అమ్మ పాట తిరుపతి గోల్కొండ బుచ్చయ్య నరేష్ రామంచి సురేష్ ఈర్ల సాగర్ కనకం రాజేందర్ భాస్కర్ దీపక్ రాము శ్రీలత శోభ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!