పేకాటరాయుళ్ల అరెస్ట్ నగదు స్వాధీనం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్-డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఆదేశానుసారం, జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూచనమేరకు హొతి-కె గ్రామ శివారులోని ఇటుకల బట్టి ప్రక్కన గల ఖాళీ స్థలంలో గల వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు, అందిన నమ్మదగిన సమాచారం మేరకు, డి. సుజిత్, ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జహీరాబాద్ రూరల్ సిబ్బందితో అక్కడికి వెళ్ళి రైడ్ చేసి, పట్టుకొని వారి వద్ద నుండి రూపాయలు 7,140 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 7 మొబైల్ ఫోన్లు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు, జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ డి. సుజిత్ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.