
ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ సూచించారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించాలని, వీక్షకులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, డివైజిఎం, ఈఅండ్ఎం జి నాగరాజు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, ఏరియా స్టోర్ ఎస్ఈ (ఈఅండ్ఎం) పైడిశ్వర్, రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ డివైసీఎంవో ఎం ఉష, పలు డిపార్ట్మెంట్ల అధికారులు, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు.