మేడారం జాతరకు 262 ప్రత్యేక బస్సుల ఏర్పాటు

పరకాల పశువుల సంత వద్ద 192 బస్సులు ఏర్పాటు

పరకాల డిపోలో మేనేజర్ రవిచందర్

పరకాల నేటిధాత్రి
పరకాల డిపో నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రయాణికులు ప్రత్యేక బస్ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని పరకాల డిపో మేనేజర్ ఎం.రవిచందర్ అన్నారు.19 పిబ్రవరి నుండి 24 పిబ్రవరి వరకు 262 ప్రత్యేక ఆర్టిసి బస్సులను పరకాల డిపో నుండి ఏర్పాటు చేయడం జరిగిందని పరకాల డిపోలో 42 బస్సులు మిగతా డిపో నుండి 220 బస్సులను తీసుకుంటున్నామని పరకాల డిపో పరిధిలో మూడు మేడారం క్యాంపులు నుండి బస్సు సర్వీసులను నడపడం జరుగుతుందని పరకాల పశువుల సంత నుండి 192 బస్సులు,క్యాంపు చిట్యాల నుండి 40 బస్సులు,ములుగు గణపురం నుండి 30 బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.పరకాల నుండి పెద్దలకు 250 రూపాయలు,పిల్లలకు 150 రూపాయలు,చిట్యాల నుండి పెద్దలకు 250 రూపాయలు, మరియు పిల్లలకు 150 రూపాయలు,ములుగు గణపురం నుండి పెద్దలకు 200 రూపాయలు,పిల్లలకు 110 రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు అందజేసే ఉచిత బస్సు ప్రయాణం అలాగే కొనసాగుతుందని అన్నారు. ప్రతి మహిళ తప్పనిసరి ఒరిజినల్ ఆధార్ కార్డ్ వెంట తీసుకొని రాగలరు కండక్టర్ కు ఒరిజినల్ ఆధార్ కార్డును చూపించి ఉచిత బస్సు ప్రయాణం వినియోగించుకోగలరని ఆర్టీసీ వారికి మహిళలందరూ సహకరించగలరని కోరారు.11 పిబ్రవరి ఆదివారం రోజు నుండి పరకాల బస్ స్టేషన్ నుండి మేడారం జాతరకు బస్సులు అందుబాటులోకి వస్తాయని అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ ఎం.రవి చందర్  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!