మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను శుక్రవారం ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ సందర్శించి, జరుగుతున్న పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలను సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఫిబ్రవరి 19 సోమవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం రాజేశ్వర్ రెడ్డి, ఏజీఎం ఈఅండ్ఎం నాగరాజు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ డీజీఎం శ్రీనివాసులు, ఎస్ఇఇఅండ్ ఎం ఏరియా వర్క్ షాప్ ఎం నాగరాజు నాయక్, ఎమ్.వి.టి.సి మేనేజర్ శంకర్, సిమ్టార్స్ ఎస్ఓఎం విజయ్ కుమార్, సివిల్ ఎస్ఈ జయప్రకాష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.