భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా ధర్మసమాజ్ పార్టీ ఆఫీసులో భూపాలపల్లి జిల్లా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా దూడపాక శ్రీకృష్ణ మహారాజు నియామకం
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి జిల్లా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఇన్చార్జి పూరెల్ల విష్ణు మహారాజ్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ధర్మ స్టూడెంట్స్ యూనియన్(DSU) పోరాటానికి సిద్ధంగా ఉందని మాట్లాడారు. దూడపాక శ్రీకృష్ణ మాట్లాడుతూ
ధర్మ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా నాపై నమ్మకం నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి విష్ణు మహారాజ్ గారికి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ధర్మసమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు తూచ తప్పకుండా పనిచేస్తాను అని అన్నారు
ఈ కార్యక్రమం లో భూపాలపల్లి జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్, బండారి దశరథo, మెకిడి అశోక్ ,విద్యార్థులు దూడపాక హరీష్, బోయిని ప్రసాద్ పాల్గొన్నారు