
GPOs Thank CM and Minister for Appointment Letters
జీపీవోలకు నియామక పత్రాలు: సీఎం, మంత్రికి కృతజ్ఞతలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన జీపీవోల తరఫున రాజు మాట్లాడుతూ, ఐదవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను పునరుద్ధరిస్తూ ప్రజలకు చేరువ చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకితభావంతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నియామకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నారు.