
Helping Hand Organization
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం.
రాయికల్ నేటి ధాత్రి:
అభిలాష్ హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ప్రతిభ పురస్కారాలతో సత్యరించడం జరుగుతుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్నేషనల్ ప్రతిభ అవార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గంగాధరి సురేష్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషి చేసిన వారికి విశ్వమాత మదర్ థెరిస్సా ఇంటర్నేషనల్ ప్రతిభ పురస్కారం, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ ప్రతిభ పురస్కారం, స్వాతంత్ర్య ఉత్తమ ప్రతిభ పురస్కారం, స్వాతంత్ర్య సమర యోధుడు కొమురం భీమ్ ఉత్తమ ప్రతిభ పురస్కారం , సమరయోధురాలు చాకలి ఐలమ్మ ఉత్తమ ప్రతిభ పురస్కారం తదతర మహనీయులు పేరిట పురస్కారాలతో సత్యరించి , వారి సేవలను అభినందిస్తూ వారిని ప్రోత్సహించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు.సామాజిక సేవా, పర్యావరణ సంరక్షణ, చెట్ల పెంపకం, కాలుష్య నివారణ, ఆధ్యాత్మికం,జానపద, శాస్త్రీయకళలు, సాహిత్యం,సంగీ,గానం, నాట్యం,చిత్రకళ, ఫోటో గ్రఫీ,నీటిని, దర్శకత్వం,విద్య, వైద్యం,క్రీౠ, వృత్తి కళ, సినిమా రంగం షార్ట్ ఫిలిం, యూట్యూబర్స్,గ్రామ సేవా సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు,నాటన రంగం తదితర రంగాలకు చెందిన వారు ఈ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.ఆసక్తి గల అభ్యర్థులు ఆగఘ్ట 20 తేదీ 2025 వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. అవార్సను ప్రధానం అందించే వేదిక రవీంద్ర భారతి 28-8-2025 తేదీన మధ్యాహ్నం 12 గంటల నుండి 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.మరికొన్ని వివరాలకు 6302908528 ఫోన్ నెంబర్ ను సంప్రదించాలని కోరారు.షరతులు వర్తిస్తాయని తెలిపారు.