రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రాజీవ్ చౌక్ ఆర్టీసి బస్టాండ్ దగ్గర జరిగిన దివ్యాంగుల బస్సు పాస్ దరఖాస్తులకు దాదాపుగా 30 మంది దివ్యాంగులు హాజరై బస్సు పాస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రోగ్రాం ని సక్సెస్ చేసినందుకు గాను ఆర్టీసీ అధికారులకు, దివ్యాంగులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మారపల్లి నరేష్ అన్నాడు.