జడ్చర్ల
వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా గెలుపొందిన జనంపల్లి అనిరుద్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఫోరమ్ ఫర్ బెటర్ జడ్చర్ల మున్సిపాలిటీ నాయకులు జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో
కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిన మన జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం మని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వలని కొరుతూ ఫోరమ్ ఫర్ బెటర్ జడ్చర్ల మున్సిపాలిటీ అధ్యక్షులు,కాంగ్రెస్ యువ నాయకుడు పెద్ది బాలకృష్ణ అధ్వర్యంలో జడ్చర్ల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించడం జరగింది ఈ కార్యక్రమంలో నాయకులు వాసవి శ్రీనివాసులు,నరేందర్ రెడ్డి,గుంత అశోక్ కుమార్,గోనెల శ్రీనివాస్,బాలకృష్ణ సాగర్,జంగి రెడ్డి తదతరులు పాల్గొన్నారు.