అంగరంగ వైభవంగాశ్రీ మత్స్య గిరి స్వామి తిరు కళ్యాణోత్సవం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ మత్స్యగిరి స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల మధ్య దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి యాగ్నీకులు వీరవెల్లి వేణుగోపాల చారి స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించినారు అంతకుముందు శ్రీ మత్స్యగిరి స్వామి వారికి జిన్నా కృపాకర్ రెడ్డి రేఖా దంపతులు దంపతులు రథము నూతనంగా నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవాలయానికి అప్పగించినారు కళ్యాణ అనంతరం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి రాజమణి దంపతులు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు కళ్యాణ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్సేనారెడ్డి కృపాకర్ రెడ్డి అడ్వకేట్ లెక్కల జలంధర్ రెడ్డి గన్ను వేణుగోపాల్ కంబత్తుల ప్రకాష్ పన్నాటి ప్రకాష్ మామిడి రాజు దిడ్డి ప్రభాకర్ గొల్లపల్లి సదానందం రామ్ గోపాల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!