చెన్నూర్ నేటి ధాత్రి::
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో రిటర్మెంట్ ఆర్ సి బెనిఫిట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు 60 సంవత్సరాలు దాటిన వారికి వీడిఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని కోరుతూ సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు నగేష్ , అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రవీణ, పద్మావతి, శారద, మణిమాల,విజయలక్ష్మి, భారతి,లలిత,సురేఖ, సావిత్రి, రాజు భాయ్,హేమలత, సుగుణ,ఈశ్వరి,సునీత తదితరులు పాల్గొన్నారు