పోలీసుల అదుపులో అంగన్వాడి సిబ్బంది…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రజా భవన్ ముట్టడి కొరకు హైదరాబాద్ కు వెళ్తున్న 11 మంది అంగన్వాడి సిబ్బందిని రామకృష్ణాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ ఏరియాలో 11 మంది అంగన్వాడీ సిబ్బంది ఓకే చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా వారి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉన్నాయనే ఉద్దేశంతో అంగన్వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.