పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

మొగుళ్లపల్లి అక్టోబర్ 14 నేటి ధాత్రి:

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ మొగుళ్లపల్లి మండలంలోని కోర్కిశాల మోడల్ స్కూల్ లో 2015-2016 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు సోమవారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.పాఠశాలలో చదివిన విద్యార్థులు డాక్టర్స్ గా,సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకేచోటుకు చేరుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరుప అలింగనం చేసుకొని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎండీ అక్బర్,మహాముద్, విక్రమ్, కొమురెల్లి, ప్రతిభా, శైలజ విద్యార్థులు కట్ల రాకేష్, అనిల్, దానవేణి దేవేందర్,మాధవి, అనూష కల్పన పూజిత అఖిల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *