
: Vanaparthi Demands Completion of Vegetable Market
కందకంలో సమీకృత కూరగాయల మార్కెట్ ను నిర్మాణం చేపట్టాలి
వనపర్తి నేటిదాత్రి
వనపర్తి పట్టణం లో 10, 21 వ వార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ అఖిల్ పక్ష ఐక్యవేదిక నాయకులు సందర్శిం చారు ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 21వ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారని తెలిపారు నిర్మాణం పూర్హి చేసి కూరగాయల వ్యాపారులకు ఇస్త వనపర్తి లో ట్రాఫిక్ సమస్య ఉండదని అన్నారు కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల కు గురి అవుతున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి కందకము లో కురాగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని కోరారు సతీష్ యాదవ్ వెంట వెంకటేశ్వర్లు,తెలుగుదేశం కొత్త గొల్ల శంకర్, గౌనికాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్, గంధం భరత్, రామస్వామి, కురుమూర్తి, శివకుమార్, కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు