ఖాలి స్థలం కబ్జాకు యత్నం..?

ప్రహరీ గోడ కూల్చిన వ్యక్తిపై కేసు నమోదు

స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ కబ్జా ప్రయత్నం చేసిన ఘనుడు

వరంగల్, నేటిధాత్రి

వరంగల్ నగరం బాలాజీనగర్ దగ్గరలో గల స్థలం వివాదంలో ఉందంటూ, దేశాయిపేట ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా బోర్డు పాతాడు కోట సతీష్ అనే వ్యక్తి పేరుతో. ప్రధాన పార్టీలో ఓబీసీ మొర్చా జిల్లా ఉపాధ్యకుడినంటూ ఈ కబ్జా తతంగానికి తెర లేపాడు అని బాధితుడి ఆవేదన. కాశీబుగ్గకు చెందిన వ్యక్తి 20వ డివిజన్లో ప్రధాన జాతీయ పార్టీ నాయకుడుగా ప్రచారమవుతూ కబ్జాలు చేస్తునట్టు తెలిపిన బాధితుడు. దేశాయిపేట నుండి ఏనుమాముల మార్కేట్ కు వెళ్ళే ప్రధాన రహదారిలో దాదాపు లక్షల రూపాయల విలువైన భూమిలో పాగా వేసినట్టు బాధితుడు మీడియాకు తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సర్వెనంబర్ 271/ఏ లో 85 గజాల స్థలం ఈ నెల 4న రిజిస్ట్రేషన్ చేసుకున్నానన్న బాధితుడు, అట్టి స్ధలంలో 2022వ సంవత్సరంలో ఆ స్థలం కోర్టు వివాదంలో ఉందంటూ అందరినీ తప్పుతోవ పట్టించి, పోలీసులకు బయనా పత్రాలు చూపెట్టి నమ్మించే ప్రయత్నం చేశాడని, నిర్మించిన ప్రహారి గోడను సైతం కూల్చి, బోర్డు పాతి వెళ్ళాడని, అందుకు లక్ష రూపాయల అస్థి నష్టంతో పాటు, స్థలం వివాదంలో ఉంటే ఎవరూ కోనుగోలు చేయరని, నష్ట పరిహారం చెల్లించే విధంగా పొలీసులు చర్యలు తీసుకుని, అక్రమంగా గోడను కూల్చిన బీజేపీ నాయకుడు ఆయిన కోట సతీష్ పై కేసు నమోదు చేయాలంటూ ఏనుమముల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశానని బాధితుడు తెలిపాడు. పూర్తీ వివరాలు సేకరించిన ఎనుమామూల పోలీసు స్టేషన్ ఎస్సై రాజు కేసు ఎఫ్ఐఆర్ (14/2025) నమోదు చేసినట్టు బాధితుడు తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!