కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరికుంట చెరువు వద్ద అమృత్ మిత్ర 2.0 కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ధరణి సృష్టి మహిళా సమైక్యల సంఘాల మహిళలతో చెట్లు నాటించుట కొరకు అమృత్ మిత్ర 2.0 కిట్లను మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాజేష్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెప్మా డిఎంసి రేణుక,ఏడీఎంసి ఎస్.కె వహీదా టీఎల్ఎఫ్ ఆర్పి లు మాధవి సిఎల్ఆర్బి సుమలతతో పాటు సంఘాల మహిళలు పాల్గొన్నారు.