నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట తేదీ 15 -7-24నుండి 20-7-24 జరిగే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్య అతిథిగా సిడిపిఓ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యనుకు సంబంధించిన అంగన్వాడి పిల్లలను అంగన్వాడీలో చేర్పించి వారి భవితకు పునాది వేయాలని పిల్లలకు వారిశారీరక అభివృద్ధి తోడ్పడతాయని తదితర అంశాలు తల్లులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు కే శ్రీదేవి, ఏం రాజా రాణి, అంగన్వాడీ టీచర్లు అనిత, సంపూర్ణ,కళావతి,వినోద, హేమలత,సుగుణ,భాగ్యలక్ష్మి గర్భిణీలు బాలింతలు కిషోర బాలికలు ప్రీస్కూల్ పిల్లల తల్లులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.