డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఘనంగా నిర్వహించారు
జహీరాబాద్. నేటి ధాత్రి:
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సంద
ర్భంగా ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని జమియత్ ఉలమా-ఇ-హింద్ మండల అధ్యక్షులు సయ్యద్ మజీద్
ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధ్యం చేసిన అంబేద్కర్ రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి అని గుర్తుచేశారు. మహాశయుని ఆశయాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి నిర్ణయాలతో సామాజిక న్యాయం కోసం అవిరాళ కృషి చేస్తోందని చెప్పారు.