నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని బానోజీపేట
గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి 2007-2008 బ్యాచ్ విద్యార్థులు మరియు అప్పటి ఉపాధ్యాయులు, విద్య కమిటీ చైర్మన్ గోపు మమత ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం అప్పటి ప్రధానోపాధ్యాయులు రిటైర్డ్ పీ.జీ.హెచ్ఎం కోడెం ఈశ్వర మూర్తి అధ్యక్షతన ఘనంగా జరిగింది.సుమారు 16 సంవత్సరాల కిందట విద్యాభ్యాసాన్ని కొనసాగించి ఎస్ఎస్సి ఉత్తీర్ణతను సాధించిన విద్యార్థులు కలిసి వారి పాతజ్ఞాపకాలు ,ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.గత విద్యార్థి దశ నుంచి వారి వైవాహిక జీవితం, ఆలనా పాలనా, విద్యాభ్యాసాలు,వారి జీవితంలో నిలదోక్కుకున్న విధానం తదితర అంశాలు ఒకరినొకరు పంచుకొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాగిత యాకయ్య,కుంచారపు రాంరెడ్డి, మహమ్మద్ మస్తాన్ ,అంకేశ్వరపు కుమారస్వామి , రాపాల అశోక్, అంబిరరూ సోమయ్య, ,విద్యార్థులు రాజేందర్ ,ఆలీ ,బి.అనిల్ సుమన్, నాగరాజు,ఎం. అనిల్ ,రాజు ,సందీప్, మధుకర్, భాస్కర్, మానస ,నవత ,సునీత, కల్పన ,రజిత ,లావణ్య, సలేంద్ర, మమత, దివ్యశ్రీ, అనూష ,తదితరులు పాల్గొన్నారు.