పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో కొప్పుల గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకున్న ఎస్ఎస్ సి పూర్వ విద్యార్థులు 2000-2001 బ్యాచ్ విద్యార్థులు అందరు కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ను లలిత కన్వెన్షన్ హాల్ పరకాలలో జరుపుకోవ డం జరిగింది ఇట్టి సమావేశా నికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు రవీందర్ ముక్తవరం శ్రీనివాసచారి, రేగులమొగిలి, వేములపల్లి మొగిలి,అడిదల మోహన్ రెడ్డి పసునూటి సంపత్, ఆడెపు ఆనంద్,అల్వాల శ్రీధర్, కల్లెపూ సమ్మయ్య , ఆనాటి విద్యా కమిటీ చైర్మన్ అయిన తడక చంద్రమౌళి గౌడ్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన డం జరిగిందిఉపాధ్యాయులం దరూ మాట్లాడుతూ మీలాంటి ఇంత మంచి బ్యాచ్ ని సమావేశం ఏర్పరచుకొని ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ 50 ఒకే చోట చేరి ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ తరగతి గదిలో జరిగే ప్రతీది గుర్తు చేసుకుంటూ ఉపాధ్యా యులకు విద్యార్థుల మధ్య జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రతి ఒక్క విద్యార్థి మంచి స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు దీవించడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి రాజు, సామల శ్రీనివాస్, ఆకుతోట తిరుపతి, రాంపల్లి రాము, మరియు ఆలువాల హేమలత తదితరులు పాల్గొన్నారు