ఇందిరమ్మ కాలనీలో నీటి కొరత ఉన్నందున ప్రత్యాత్నమా నీటి సరఫరా

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగడపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు పలగడం వలన నీటి కొరత అప్పుడప్పుడు రావడంతో గ్రామప్రజలు నీటి కొరత ఎదుర్కోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మధుకర్ పై అధికారులతో మాట్లాడి శాశ్వతపరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరారు బోరు ఉన్న స్థలంలో గ్రామపంచాయతీ అధికారులతో మాట్లాడి బోర్ స్టార్ట్ చేపించి ప్రజలకు నీటి సౌకర్యం అందేలా చర్యలు తీసుకున్నారు అలాగే బోరు లేని ఏరియాలో గ్రామపంచాయతీ నుండి వాటర్ ట్యాంకర్ ను పంపుతున్నామని గ్రామపంచాయతీ అధికారులు తెలియజేశారు ఎలాగైనా నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమే దిశగా సంబంధిత అధికారులు కానీ నాయకులు గానీ చొరవ తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *