రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎనమిదోవ తరగతి విద్యార్థిని శ్రీహర్ష సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ వాలీబాల్ టోర్నమెంట్ లో కరీంనగర్ జిల్లా జట్టు తరుపున పాల్గొని ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని అల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.