
జిల్లా కలెక్టర్
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినివిద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు వసతులు కల్పించాలని అలాగే ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు లైట్లు ఫ్యాన్లు సౌకర్యం కల్పించాలని ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి వారి అభ్యసన సామర్ధ్యాలను పరిశీలించారు పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ఇతర వసతులు ఎలా ఉన్నాయని కలెక్టర్ విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తి గా ఉన్న తరగతిగది భవనాన్ని త్వరగా పనులు చేపట్టి పూర్తిచేయాలని దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశించారు పాఠశాలలో కొత్తగా 6 గదులు నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని టాయిలెట్స్ కాంపౌండ్ వాల్ దగ్గర పరిశుభ్రంగా ఉంచాలని వెంటనే దానికి సంబంధించిన మరమ్మత్తు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇట్టి తనిఖీల్లో ఎంఈఓ రాజు ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ వెంకటేశ్వర స్వామి తదితరులు ఉన్నారు