ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించండి

సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి మార్చ్ 02

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధికి నిధులను కేటాయించాలని ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ని ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల ఇంఛార్జులు
మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తో కలిసి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.

ఉప్పల్ నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిసి రోడ్లు, డ్రైనేజీ నేటికీ ఉన్నాయన్నారు.

తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగ లేదన్నారు. ప్రజల సౌకర్యార్థం కాలనీలలో అభివృద్ధి పనులను చేపట్టడంతోనే సమస్యలు తొలగిపోతాయని కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టుగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *