అన్ని రాజకీయ పార్టీలు ఎంపీ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలి

– మంద కుమార్ మాదిగ
ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి.

హన్మకొండ, నేటిధాత్రి:

ఈ రోజు హంటర్ రోడ్ దీన్ దయాళ్ నగర్లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్ధల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెస్సీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ త్వరలో జరుగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలు మాదిగలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గంలో అత్యధికంగా ఉండే జనాభా మాదిగలు కనుక ప్రతి పార్టీ నుండి మాదిగలకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలను మోసం చేసిందని అన్నారు , కాంగ్రెస్ పార్టీ మాదిగల ప్రాధాన్యం తగ్గిస్తుందని ప్రతి మాదిగ బిడ్డ దాన్ని గమనిస్తూనే ఉన్నారనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో …
ఎమ్మెస్సీ జాతీయ నాయకులు
వేల్పుల సూరన్న కాపు ,
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జన్ను దినేష్ మాదిగ ,
ఎమ్మెస్పి జిల్లా అధ్యక్షుడు
బండారి సురేందర్ మాదిగ ,
ఎంవైఎస్ మాజీ రాష్ట్ర నాయకులు
చేతాళ్ల శివ మాదిగ ,
ఎమ్మేస్పి జిల్లా కార్యదర్శి
రాజరపు కిరణ్ మాదిగ ,
మైనం పున్నం చందర్ ,
మైనం దిలీప్ మరియు తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *