Alfors Students Selected for State Baseball Tournament
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఆల్ఫోర్స్ కళాశాలకు చెందిన విద్యార్థులు 28అక్టోబర్2025న కరీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి బేస్ బాల్ అండర్19 పోటీలలో పన్నెండవ తరగతికి చెందిన విద్యార్థులు కే.సిద్ధార్థ, కే.అభిరామ్, టి.వినయ్ మంచి ప్రతిభను కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల ప్రధానోపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈకార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
