జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన గ్రామానికి చెందిన నేండుగురి సురేష్ వయసు 32 సంవత్సరాలు తండ్రి పేరు నేండుగురి బాపు ఇతను ప్రతిదినము కూలి పని చేస్తూ జీవితము కొనసాగించేవాడు. మద్యానికి బానిస అయ్యి సోమవారం రోజున పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతు బుధవారం రోజున మరణించడం జరిగింది. జైపూర్ మండలం ఎస్సై నాగరాజు పంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.