అభివృద్ధిలో ఆలంపూర్ వెనుకబడింది.

మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే విజయుడు వినతి.

ఆలంపూర్ నేటి దాత్రి.

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి చేసేందుకు అత్యధికంగా నిధులు కేటాయించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గం అన్ని రంగాలలో వెనుకబడిందని, ఎర్రవల్లి మండలానికి 220 కేవీ సబ్ స్టేషన్, నియోజకవర్గానికి అవసరమైన విద్యుత్ మెటీరియల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ లను మంజూరు చేయాలని మంత్రులను ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గ ప్రాంత ప్రజలు వ్యవసాయంపైనే జీవనం కొనసాగిస్తారన్నారు. లో వోల్టేజ్ సమస్యపై దృష్టి సారించి సమస్య తీర్చాలన్నారు. నియోజకవర్గంలో విద్య,వైద్యం, గ్రామీణ బీటీ రోడ్డు రవాణా వ్యవస్థ, విద్యుత్ సమస్య,నూతన మండలాలకు ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి,నరేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ అశోక్ రెడ్డి,మహిపాల్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!