ముదిరాజ్ ఆత్మ గౌరవ పాదయాత్రలో ఆకుల సుభాష్ ముదిరాజ్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం తెలంగాణ ఆరాధ్య దైవలు శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ లను దర్శించుకొను ఈ నెల 18 శుక్రవారం రోజునా ముదిరాజ్ ల పట్ల జరుగుతున్న వివక్ష విద్య ఉద్యోగ ఉపాధి ఆర్థిక సామజిక రంగాలలో ప్రభుత్వం చూపుతున్న వైఖరికి బి సి – డి నుండి బి సి -ఏ కు మారుస్తానని హామీ నెరవేర్చక పోవడం పట్ల నిరసన తెలుపుతూ తెలంగాణ ముదిరాజ్ సమాజ్ సంఘం అధ్యక్షులు
దారం యువరాజ్ ముదిరాజ్
ముదిరాజ్ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభం చేశారు. ఈరోజు వారి పాదయాత్రకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ సంఘీభావం తెలుపుతూ. మండు వేసవిలో వారి పాదయాత్రను చూసి కళ్ళు చెమ్మగిల్లయాని వారు అన్నారు పాదచారుల ఆరోగ్యంపై క్షేమ సమాచారిని అడిగి తెలుసుకున్నామని ఆకుల సుభాష్ తెలిపారు.