నియామకపుత్రాన్ని అందజేసిన జిల్లా అధ్యక్షుడు
నిజాంపేట: నేటి ధాత్రి
గతంలో ఏబీవీపీ బాగ్ ప్రముఖ కొన్ని సంవత్సరాలు విద్యారంగ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థుల కోసం అహర్నిశలు తపించి బిజెపి పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నందున బిజెపి పార్టీ అధిష్టానం బిజెపి కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు ఇచ్చారని ఆకుల రమేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తనను నమ్మి తనకు ఈ పదవిని ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ ఎదుగుదల కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ నాయకులు సిద్ధ రాములు, తీగల శ్రీనివాస్, బాజా అంజయ్య, పోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు