Savitribai Phule Jayanti Celebrated at Kalvala ZP High School
చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…
దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే
ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్
కేసముద్రం/ నేటి ధాత్రి
శనివారం కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మధ్య యుగపు చీకటి రోజులలో సమాజం అందాకారంలో బంధించబడి పరిస్థితులు ఉన్న రోజులవి అన్నారు. మూడవిశ్వాసాలతో, సాంఘిక దురాచారాలతో వెలుగొందితూ.. స్త్రీలకు చదువుకునే అవకాశం లేక, స్త్రీలు అనగదొక్కబడుతున్న కాలంలో… భర్త జ్యోతిబాపూలే సహకారంతో చదువుకొని భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాయించిందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మొదటి బాలిక పాఠశాలలను స్థాపించింది. స్త్రీ విద్యకు పునాది వేయడం జరిగింది. పుస్తకం పట్టిన చేతులు భవిష్యత్తును మార్చగలరని, అందాకారాన్ని చీల్చన విద్యా దీపం అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి నీలంతా బాగా చదువుకొని సమాజ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులైన కే పార్వతి, రాధాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, రాగి బిక్షపతి, మహంకాళి యాకాంబరం, వి రాజేంద్ర చారి, బి బాలాషోరెడ్డి, కే రాములు, ఎం శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ ఏ కొప్పుల శంకర్, కె పార్వతి, ఎండి జుబేర్ అలీ, ఓడపల్లి రాము, జి నాగరాజు, ఏ లింగయ్య, ఎస్ సునీల్, ఎస్ రాధాదేవి మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
