ఉద్యోగాల వయోపరిమితి పెంపు ఘనత ఏఐటీయూసీదే 

సింగరేణిలో నూతన గనులు రావలసిన అవసరం ఉంది

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ 

భూపాలపల్లి నేటిధాత్రి 

కార్మికుల సొంతింటి కల 10 లక్షల వడ్డీ లేని రుణాల కోసం యాజమాన్యంతో చర్చించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు.

శనివారం కేటీకే -1గనిలో ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సదయ్య అధ్యక్షతన గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి.రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొని మాట్లాడుతూ..ఈ మాట్లాడుతూ సింగరేణిలో నూతన గనులు ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని, ఈ విషయంపై యాజమాన్యంతో చర్చించడం జరిగిందని త్వరలోనే నూతన గనుల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే గుర్తింపు సంఘంగా గెలిచిన అనతి కాలంలోనే పలు డిమాండ్లను సాధించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 40 సంవత్సరాల వయసుకు పెంచడం పెంచడం జరిగిందని వివరించారు. అలాగే టెక్నీషియన్లకు, మైనింగ్ సూపర్వైజర్లకు సర్ఫేస్ లో సూటబుల్ జాబ్ ఇవ్వడం, గతంలో మైనింగ్ సర్టిఫికెట్ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగాలు పోయిన జేఎంఈటి లకు తిరిగి ఉద్యోగాలు ఇప్పించడం ఏఐటీయూసీ కూడా ఘనతే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జి శ్రీనివాస్ సుధాకర్ రెడ్డి కాంట్రాక్ట్ వర్కర్ ఇంచార్జ్ నూకల చంద్రమౌళి బ్రాంచ్ ఆర్గనైజ్ సెక్రటరీ గుడేటి ఐలయ్య రాజయ్య భైరవేణి కొమురయ్య అసిస్టెంట్ పిట్ సెక్రటరీ హైమద్ ఖాన్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ లు, నరేష్ సంతోష్ షిఫ్ట్ ఇన్చార్జిలు మైన్స్ కమిటీ సభ్యులు,సేఫ్టీ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ, క్యాంటీన్ కమిటీ సభ్యులు,పిట్ కమిటీ సభ్యులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!