విద్యార్ధుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష కీలకం

ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్ చంద్ర

హన్మకొండ లో ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్ష

హన్మకొండ, నేటిధాత్రి

అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా నక్కలగుట్ట ఆర్యభట్ట విద్యాసంస్థలలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష పత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్ చంద్ర హాజరై మాట్లాడుతూ ఏ .ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ పరీక్ష విద్యార్థులలో ప్రధాన పరీక్ష పట్ల ఆత్మవిశ్వాసం కలిగించడమే కాకుండా విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వేల్కి తీయడంలో ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు ఏ ఐ ఎస్ బి నిర్వహిస్తున్న ఈ పరీక్ష వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు విజయ్, అరవింద్ ,గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *