అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన.

CPI District Secretary Panjala Srinivas CPI District Secretary Panjala Srinivas

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మృతులకు సిపిఐ సంతాపం

మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి-సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ప్రజలందరినీ తీవ్రంగా కలిచివేసిందని, విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారందరికీ సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి వైపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని,మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్నిఒక ప్రకటనలో కోరారు.

ఈసందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌లోని గాట్విక్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడువందల ఎనబై ఏడు డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ-నూటడెభైఒకటి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడం, సిబ్బందితో సహా రెండు వందల నలభై రెండు మందితో ప్రయాణిస్తున్న విమానం, విమానాశ్రయ సమీపంలో ఉన్న వైద్య కళాశాలలోకి దూసుకెళ్లి కూలిపోయిందని, విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు బిల్డింగ్ లో భోజనం చేస్తున్న డాక్టర్లు, వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా చనిపోవడం అత్యంత బాధాకరమనన్నారు. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిందని, సాంకేతిక కారణాలవల్ల ఈసంఘటన జరిగి ఉండవచ్చని, ఇంత పెద్ద ఘటన జరగడం భారతదేశాన్ని కాకుండా యావత్తు ప్రపంచాన్ని విషాదంలో ముంచిందని, భారత ప్రయాణికులతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరమని, విమాన ప్రయాణాలకు ముందు సాంకేతిక కారణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఈఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరపాలని, మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీనివాస్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!