రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసిన కమ్మరిగూడెం రైతులు..
మొక్కజొన్న బహుళ జాతి కంపేనీ చేత మోసపోయా..
మోసపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలి.
నూగుర్ వెంకటాపురం
(నేటి ధాత్రి ),మార్చి 3 ములుగు జిల్లా వెంకటాపురం మండలం
బహుళ జాతి కంపెనీ మొక్కజొన్న పంట వేసి పూర్తిగా నష్టపోయామని కమ్మరిగూడెం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం నాడు వ్యవసాయ అధికారి జాడి ప్రియాంకకు రైతులు వినతి పత్రం అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ. ఎకరాకు 4 టన్నులు వస్తుందని మాయ మాటలు చెప్పి బహుళ జాతి మొక్కజొన్న విత్తనాలైనా సింగెంటా కంపెనీ వెంకటాపురం డీలర్స్ మాతో పంట సాగు చేయించారు.ఒక ఎకరానికి రెండు టన్నుల దిగుబడి కూడా రాలేదని, పండించిన పంట కూలీలకు మాత్రమే సరిపోతుందని వాపోయారు,ఇంకా పెటిలైజర్ షాపులకు ప్రతి ఎకరానికి 50వేల రూపాయలు అప్పు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఇలా అప్పుల పాలైతే మరణమే మార్గమని అన్నారు.ప్రభుత్వం స్పందించి నష్ట పోయినా ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మరిగూడెం రైతులు పూనెం శ్రీను,విజయ్,రవి,ప్రసాద్ , సొయం నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.