పరకాల నేటిధాత్రి
పరకాల మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ శనివారం రోజున పరకాల పట్టణంలోని పలు ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసే క్రమంలో ఎరువులు పురుగు మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి అనంతరం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరతను నియంత్రించే నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరకాల పరిధిలోని అలాట్మెంట్ అయినా ఎరువులను ఇతర జిల్లాలకు హోల్సేల్ లో అమ్మకూడదని ఫర్టిలైజర్ షాప్ యజమానులకు తెలియపరుస్తూ రైతులు తప్పకుండా ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఆధార్ కార్డు తో కొనుగోలు చేసుకోవాలని కోరారు.
ఎరువుల దుకానులను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి
