
సిరిసిల్ల, మే – 9(నేటి ధాత్రి):
గుర్తు తెలియని వాహనం ఢీకొని రోడ్ పై చనిపోయి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన పెట్టిన అదనపు ఎస్పీ.
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపుర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించి రోడ్ పై ఉన్న శునకాన్ని విధినిర్వహణలో అటు వైపు నుండి వస్తున్న అదనపు ఎస్పీ చంద్రయ్య వాహనం ఆపి రోడ్ పై మరణించి ఉన్న శునకాన్ని తీసి రోడ్ పక్కన వేసి మానవత్వం చాటుకున్నారు.
రోడ్ ప్రమాదాల్లో మరణించిన కానీ కొస ప్రాణంతో ఉన్న శునకాలను తీసి పక్కకు పెట్టాలని లేని యెడల మరణించిన శునకాన్ని తప్పించే సందర్భాల్లో రోడ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని జంతువుల పట్ల ప్రతి ఒక్కరు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.