
మండలంలో యూరియా లభ్యత పర్యవేక్షణ అదనపు కలెక్టర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ గణపురం మండలాన్ని సందర్శించి యూరియా లభ్యత పంపిణీని తనిఖీ చేశారు. వారి తో పాటు జిల్లా వ్యవసాయ అధికారి బాబు రావు
జిల్లా సహకార అధికారి ఎం. వాల్య నాయక్
మండల వ్యవసాయ అధికారి డి. ఇలయ్య ఏ సి ఎస్ గణపురం సీఈఓ ఉన్నారు.
గోదాముల తనిఖీలో యూరియా నిల్వలు సరిపడుగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 405 బస్తాల యూరియా అందుబాటులో ఉంది. పంపిణీ పి ఓ ఎస్ యంత్రం మరియు ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా జరుగుతోంది.రైతులు ఆందోళన చెందకండి, విధి ప్రకారం యూరియా పొందాలని అధికారులు సూచించారు. పంట సీజన్ కోసం సరైన సమయంలో ఎరువులు అందించేందుకు యంత్రాంగం కట్టుబడి ఉంది. సొసైటీ స్టాప్ రైతులు బాబురావు మూల సదయ్య రైతులు పాల్గొన్నారు