
ADA Jagadishwar Reddy Inspects Fertilizer Shop in Parakala
ఫర్టిలైజర్స్ షాపుని తనిఖీ చేసిన ఏడిఏ జగదీశ్వర్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
నూతన ఏడీఏగా నియమితులైన జగదీశ్వర్ రెడ్డి పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాపును గురువారం రోజున తనిఖీ చేయడం జరిగింది.ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో మండల పరిధిలోని రైతులకు మాత్రమే యూరియాను ఆధార్ కార్డు అనుసంధానం చేసుకొని ఈ పాస్ మిషన్ ద్వారా యూరియాను అందించేలా వ్యాపారులు సహకరించాలని రైతులు ఏ మండలంలో ఉన్నారో ఆ మండల పరిధిలో నె యూరియాను తీసుకోవాలని వ్యాపారులు స్టాక్ బోర్డులో ఎరువుల నిలువ,ధర వివరాలను పొందుపరచాలని స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా అప్డేట్ అయి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.