Strict Action Against Drunk Driving: SI Rajesh
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు.
ఎస్సై రాజేష్.
నిజాంపేట: నేటి ధాత్రి
వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజాంపేట స్థానిక ఎస్సై రాజేష్ అన్నారు. నిజాంపేటలో ఆయన మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రజలు ఎవరు మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడం జరుగుతుందన్నారు. శిక్ష అనంతరం తమ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు.
