కుషాయిగూడ హోల్ సేల్ కాంటా లకు శాశ్వత స్థలం కేటాయింపుకు చర్యలు

కలెక్టర్ తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

జడ్సీ దృష్టికి తీసుకెళ్లిన పరమేశ్వర్ రెడ్డి, బొంతు శ్రీదేవి యాదవ్

కాప్రా నేటిధాత్రి 23:

కాప్రా సర్కిల్ లోని కుషాయిగూడ హోల్ సేల్ కాంటాలకు మరియు ఇతర వ్యాపారులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మార్కెట్ పై మూడు దశాబ్దాలుగా ఆధారపడి జీవిస్తున్న హోల్ సేల్ వ్యాపారులకు నష్టం లేకుండా ప్రత్యామ్నాయం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రంగంలోకి దిగి ఇదే విషయమై జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగింది. ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించాలని కూడా కలెక్టర్ కూ ఆదేశించారు.

ఇదే విషయంలో కూరగాయల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారులు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, స్థానిక చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు వ్యాపారులు . దీంతో పరమేశ్వర్ రెడ్డి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ సమక్షంలో వ్యాపారులు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్ ను కలిశారు.

కూరగాయల హోల్ సేల్ వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జడ్సీ త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్టుగా హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో
హోల్సేల్ కాంట సభ్యులు

పుప్పాల వెంకన్న, శ్రీనివాస్, నరేష్ కుమార్, రమేష్, నందిమ్, హరిచరణ్, రాజు రాఘవేందర్ పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!