
Youth Face Action for Misconduct: CI Warns
యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:
యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శాఖపరమైన చర్యలు తప్పవని జమ్మికుంట రూరల్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు
శుక్రవారం మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాధవి గార్ల పర్యవేక్షణలో “మార్నింగ్ వాక్ ఇన్ విలేజ్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రూరల్ సీఐ మరియు ఎస్సై తిరుపతి,సిబ్బంది తో కలిసి మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇట్టి సందర్శనలో, సిసి కెమెరాల మరియు సైబర్ నేరాల యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత చెడు దారిలో ప్రయాణించి జీవితాలను అంధకారం చేసుకోవద్దని సూచించారు. అత్యాశకు పోయి వివిధ ఆప్ లలో పెట్టుబడి పెట్టి లక్షలు, కోట్లలో మోసపోయి కుటుంబాలను రోడ్డున పడేయడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడి కన్న తల్లిదండ్రులకు, కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిచిత వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ముఖ్యంగా యువత చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుందని గుర్తు చేశారు. యువత సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. హిమ్మత్ నగర్ గ్రామస్తులు స్పందించి 6 సిసి కెమెరాల కోసం దాదాపు రూ 110,00/- లు అందించారు.ఈ కార్యక్రమంలో
గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు .